స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి

- August 25, 2017 , by Maagulf
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కబడ్డీ అకాడమీకి నల్లగొండ విద్యార్థి తరి మధు ఎంపికయ్యాడు. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన తరి మధు బొట్టుగూడ స్కూల్‌లో చదువుతూ ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాడు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ రాష్ట్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. కాగా... ఆయన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కబడ్డీ అకాడమీ జట్టుకు ఎంపిక కావటం విశేషం. ఈయన ఎంపికపై క్లబ్‌ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com