బీఫ్ బ్యాన్పై కీలక నిర్ణయం వెలువడనుంది
- August 25, 2017
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 24 గంటల్లో మరో కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ శుక్రవారం నాడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం బీఫ్ బ్యాన్పై ఉండే అవకాశం లేకపోలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఒక వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని గురువారం తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గో మాంసం తినటంపై ప్రభుత్వం బ్యాన్ విధించడం సరికాదంటూ ఇందిర వాదన విన్పించారు.
వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఏకే సిక్రీ , ఆశోక్భూషణ్లు ఇది వ్యక్తిగత గోప్యత, (ప్రాథమిక హక్కు) వర్తిస్తోందని తదుపరి వాదనను రెండు వారాలపాటు వాయిదా వేశారు.
మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్ ఆదేశాలను గత ఏడాది ముంబై హైకోర్టు తప్పుబట్టి కొట్టేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









