అల్లర్లలో 11మంది బాబా అనుచరులు మృతి
- August 25, 2017
గుర్మీత్ అరెస్టుతో పంజాబ్, హర్యానా భగ్గుమంది. గంటలోనే రెండు రాష్ట్రాల్లో 224 చోట్ల హింస చెలరేగింది. పంజాబ్లోని మాలౌట్లో గుర్మీత్ అనుచరులు రెచ్చిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రాళ్లు, కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పెట్రోల్బంక్, రైల్వేస్టేషన్ బస్స్టేషన్లు, షాపులకు నిప్పుపెట్టారు. గుర్మీత్ అనుచరుల విధ్వంసకాండతో సెక్టార్-5లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. బలగాల మోహరింపుతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనల్లో 8 మంది ఆందోనకారులు మృతి చెందారు
అటు అంతకు ముందు పంచకుల సీబీఐ కోర్టు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోర్టు వద్దకు చొచ్చుకొస్తున్న డేరా బాబా అనుచరులను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కోర్టు వద్ద ఉన్న మీడియా వాహనాలపై డేరా బాబా అనుచరులు దాడి చేసి విధ్వంసం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 224 హింసాత్మక ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









