అల్లర్లలో 11మంది బాబా అనుచరులు మృతి
- August 25, 2017గుర్మీత్ అరెస్టుతో పంజాబ్, హర్యానా భగ్గుమంది. గంటలోనే రెండు రాష్ట్రాల్లో 224 చోట్ల హింస చెలరేగింది. పంజాబ్లోని మాలౌట్లో గుర్మీత్ అనుచరులు రెచ్చిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రాళ్లు, కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పెట్రోల్బంక్, రైల్వేస్టేషన్ బస్స్టేషన్లు, షాపులకు నిప్పుపెట్టారు. గుర్మీత్ అనుచరుల విధ్వంసకాండతో సెక్టార్-5లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. బలగాల మోహరింపుతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనల్లో 8 మంది ఆందోనకారులు మృతి చెందారు
అటు అంతకు ముందు పంచకుల సీబీఐ కోర్టు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోర్టు వద్దకు చొచ్చుకొస్తున్న డేరా బాబా అనుచరులను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కోర్టు వద్ద ఉన్న మీడియా వాహనాలపై డేరా బాబా అనుచరులు దాడి చేసి విధ్వంసం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 224 హింసాత్మక ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..