అల్లర్లలో 11మంది బాబా అనుచరులు మృతి
- August 25, 2017
గుర్మీత్ అరెస్టుతో పంజాబ్, హర్యానా భగ్గుమంది. గంటలోనే రెండు రాష్ట్రాల్లో 224 చోట్ల హింస చెలరేగింది. పంజాబ్లోని మాలౌట్లో గుర్మీత్ అనుచరులు రెచ్చిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రాళ్లు, కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పెట్రోల్బంక్, రైల్వేస్టేషన్ బస్స్టేషన్లు, షాపులకు నిప్పుపెట్టారు. గుర్మీత్ అనుచరుల విధ్వంసకాండతో సెక్టార్-5లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. బలగాల మోహరింపుతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనల్లో 8 మంది ఆందోనకారులు మృతి చెందారు
అటు అంతకు ముందు పంచకుల సీబీఐ కోర్టు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోర్టు వద్దకు చొచ్చుకొస్తున్న డేరా బాబా అనుచరులను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కోర్టు వద్ద ఉన్న మీడియా వాహనాలపై డేరా బాబా అనుచరులు దాడి చేసి విధ్వంసం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 224 హింసాత్మక ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









