కతర్ విదేశాంగ మంత్రి భారతదేశంలో రెండు రోజుల పర్యటన
- August 25, 2017
న్యూ ఢిల్లీ: కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ శుక్రవారం సాయంత్రం భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకొంటారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపనున్నట్లు ప్రముఖ భారతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు కతర్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ 15.67 బిలియన్ల డాలర్లగా నమోదైంది. భారతదేశానికి ముడి చమురు సరఫరా చేసే దేశాలలో కతర్ ఒక అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. శనివారం ( రేపు ) కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో స్వరాజ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ఆయన ప్రధానమంత్రిని కలవనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









