కతర్ విదేశాంగ మంత్రి భారతదేశంలో రెండు రోజుల పర్యటన
- August 25, 2017న్యూ ఢిల్లీ: కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ శుక్రవారం సాయంత్రం భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకొంటారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపనున్నట్లు ప్రముఖ భారతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు కతర్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ 15.67 బిలియన్ల డాలర్లగా నమోదైంది. భారతదేశానికి ముడి చమురు సరఫరా చేసే దేశాలలో కతర్ ఒక అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. శనివారం ( రేపు ) కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో స్వరాజ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ఆయన ప్రధానమంత్రిని కలవనున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు