కతర్ విదేశాంగ మంత్రి భారతదేశంలో రెండు రోజుల పర్యటన

- August 25, 2017 , by Maagulf
కతర్ విదేశాంగ మంత్రి భారతదేశంలో రెండు రోజుల పర్యటన

న్యూ ఢిల్లీ: కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ శుక్రవారం సాయంత్రం భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి  చేరుకొంటారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపనున్నట్లు ప్రముఖ భారతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు కతర్   ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ 15.67 బిలియన్ల డాలర్లగా నమోదైంది. భారతదేశానికి ముడి చమురు సరఫరా చేసే దేశాలలో కతర్ ఒక అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. శనివారం ( రేపు ) కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో స్వరాజ్తో చర్చలు జరుపుతారు. ఆ  తరువాత ఆయన ప్రధానమంత్రిని కలవనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com