గోపీచంద్ హీరోగా సౌఖ్యం
- October 26, 2015
ఇద్దరు మనుషులు ఎదురైనప్పుడు పెదాల మీద చిరునవ్వుతో పాటు మనసులోనుంచి వచ్చే మాటే `సౌఖ్యంగా ఉన్నారా` అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులందరూ సౌఖ్యంగా ఉండాలనుకునే వ్యక్తి కథతో తెరకెక్కుతున్న సినిమా `సౌఖ్యం`. గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు `సౌఖ్యం` అనే పేరును ఖరారు చేశారు. ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రెజీనా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు మినహా టాకీ పూర్తయింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 7 వరకు విదేశాల్లో మూడు పాటలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాటలు చాలా హుషారుగా సాగుతాయన్నారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో రఘు మాస్టర్ నేతృత్వంలో హీరో, హీరోయిన్పై మూడు పాటలను చిత్రీకరిస్తారు. మిగిలిన రెండు పాటలను హైదరాబాద్లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు; శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్ప్రసాద్.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









