తారక్, రాజమౌళి... ఓ సైబర్ క్రైమ్ సినిమా
- August 28, 2017
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో బ్లాక్ బస్టర్లను అందించిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత జక్కన్న కొత్త చిత్రం ఏది? అన్న ప్రశ్న మొదలైనప్పుడు ఎన్టీఆర్ తో కూడా అన్న పేరు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఓ సదుద్దేశం కోసం వీరిద్దరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో రాను రాను పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు, వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించబోయే షార్ట్ ఫిల్మ్లలో ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలిద్దరూ భాగస్వాములు కాబోతున్నారు. లఘు చిత్రాలకు ఎన్టీఆర్, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్ ఓవర్ అందించేందుకు ముందుకు వచ్చారు.
ఇప్పటికే తారక్ తన పని పూర్తి చేయగా, తన గొంతుకను అందించటంతోపాటు ఆయా చిత్రాల్లో చిన్న చిన్న మార్పులను సూచించేందుకు రాజమౌళి రెడీ అయిపోయాడు. వీటిని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్ మాల్, టీవీలలో త్వరలో ప్రదర్శితం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









