'జై లవకుశ'లో మరో హీరోయిన్
- August 28, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉందట. అందులో కథానాయిక తమన్నా ఆడిపాడనున్నట్లు సమాచారం. మిల్కీబ్యూటీ అయితే పాటకు మరింత అందం తీసుకొస్తారని దర్శక-నిర్మాతలు భావించారట. ఈ మేరకు ఆమెను సంప్రదించగా నటించడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతం ఇప్పటి వరకు వచ్చిన వాటితో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుందని, తమన్నా కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్, తమన్నా జంటగా 'వూసరవెల్లి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తమన్నా ఇప్పటికే 'జాగ్వార్', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. ప్రస్తుతం ఆమె కల్యాణ్రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.
'జై లవకుశ'లో నివేదా థామస్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







