బహరేన్ లో ఇద్దరు మానవ వనురుల ఎజెంట్ల పై విచారణ
- August 30, 2017
మనామా: ఆసియా కార్మికులకు చెందిన 800 కన్నా ఎక్కువ పాస్పోర్ట్లు చట్టవిరుద్ధంగా మానవ వనురుల ఏజెన్సీ వద్ద ఉంచబడినట్లు మంగళవారం కోర్టులో వెల్లడైంది. ఈ విధంగా రెండు నియామక సంస్థలకు చెందిన యజమానుల దుర్మార్గం స్థానికంగా బహిర్గతమైంది. , ఫేక్ అధికారిక పత్రాల సమర్పణపై ఇద్దరు బహ్రెయిన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యజమానులు మంగళవారం మొట్టమొదటి హై క్రిమినల్ కోర్టు ముందు విచారణలో దోషులుగా నిలబడ్డారు. వీరు అధికారం మరియు సమాచార సాంకేతికత దుర్వినియోగం చేసినట్లు అభియోగం వారిపై మోపబడింది. . కేసును ఆన్లైన్ పోర్టల్ "సిజిలట్" ద్వారా నకిలీ అధికారిక పత్రాలను సమర్పించడం కోసం ముద్దాయిలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పరిశ్రమ, వాణిజ్య మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది.ప్రాసిక్యూషన్ ఆర్డర్ ప్రకారం కంపెనీ తనిఖీ చేస్తున్నప్పుడు మొత్తం 822 పాస్పోర్ట్ లు మరియు 135 ఐడి కార్డులను కనుగొన్నారు. ఇంకా జరిపిన విచారణలలో ఆ నిందితులు 49 నకిలీ వాణిజ్య నమోదు (సిఆర్) ల ద్వారా కార్మికులను నియమించాయని తెలిసింది. "ప్రతివాది తన నేర చరిత్రలో మోసం చేసిన కేసులలో ఉన్నాడు. కలిగి ఉన్నాడు. ఈ కేసులో అతనితో పనిచేసిన అతని చెల్లెలు, అతని సహచరుడు, ఉన్నాడని నిరూపించబడింది. న్యాయవాదులు ముద్దాయిలను నిర్బంధించాలని ఆదేశించారు, అయితే తదుపరి దర్యాప్తులు చేపట్టబడుతున్నాయి. తదుపరి విచారణ తేదీ అక్టోబరు 10 గా న్యాయాధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







