బహరేన్ లో ఇద్దరు మానవ వనురుల ఎజెంట్ల పై విచారణ

- August 30, 2017 , by Maagulf
బహరేన్ లో  ఇద్దరు  మానవ వనురుల ఎజెంట్ల పై  విచారణ

మనామా: ఆసియా కార్మికులకు చెందిన 800 కన్నా ఎక్కువ పాస్పోర్ట్లు చట్టవిరుద్ధంగా మానవ వనురుల ఏజెన్సీ వద్ద ఉంచబడినట్లు మంగళవారం కోర్టులో వెల్లడైంది. ఈ విధంగా రెండు నియామక సంస్థలకు చెందిన  యజమానుల దుర్మార్గం  స్థానికంగా బహిర్గతమైంది. , ఫేక్ అధికారిక పత్రాల సమర్పణపై ఇద్దరు బహ్రెయిన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యజమానులు మంగళవారం మొట్టమొదటి హై క్రిమినల్ కోర్టు ముందు విచారణలో దోషులుగా నిలబడ్డారు. వీరు  అధికారం మరియు సమాచార సాంకేతికత దుర్వినియోగం చేసినట్లు అభియోగం వారిపై మోపబడింది. . కేసును ఆన్లైన్ పోర్టల్ "సిజిలట్" ద్వారా నకిలీ అధికారిక పత్రాలను సమర్పించడం కోసం ముద్దాయిలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పరిశ్రమ, వాణిజ్య మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది.ప్రాసిక్యూషన్ ఆర్డర్ ప్రకారం కంపెనీ తనిఖీ చేస్తున్నప్పుడు మొత్తం 822 పాస్పోర్ట్ లు మరియు 135 ఐడి కార్డులను కనుగొన్నారు. ఇంకా జరిపిన విచారణలలో ఆ నిందితులు  49 నకిలీ వాణిజ్య నమోదు (సిఆర్) ల ద్వారా కార్మికులను నియమించాయని తెలిసింది. "ప్రతివాది తన నేర చరిత్రలో మోసం చేసిన కేసులలో ఉన్నాడు. కలిగి ఉన్నాడు. ఈ కేసులో అతనితో పనిచేసిన అతని చెల్లెలు, అతని సహచరుడు, ఉన్నాడని నిరూపించబడింది. న్యాయవాదులు ముద్దాయిలను నిర్బంధించాలని ఆదేశించారు, అయితే తదుపరి దర్యాప్తులు చేపట్టబడుతున్నాయి. తదుపరి విచారణ తేదీ  అక్టోబరు 10 గా న్యాయాధికారులు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com