డ్రగ్స్ మత్తు లో 'నిట్'
- August 30, 2017తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్నటివరకు హైదరాబాద్ చుట్టూ తిరిగిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు వరంగల్ నిట్కి పాకింది. తాజాగా వరంగల్లోని నిట్లో బుధవారం డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు స్టూడెంట్స్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిట్ హాస్టల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
పట్టుబడిన విద్యార్థుల నుంచి ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసినట్టు
తెలుస్తోంది. నిందితులు నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఒకరు బిజ్జు, మరొకరు రమేష్. వీళ్లిద్దరు
కొద్దిరోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల
మేరకు వీళ్లని అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







