బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నబాహుబలి
- August 30, 2017
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్కి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతోపాటు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో థర్డ్ పార్ట్ కూడా వున్నట్లు వార్తలొచ్చినప్పటికీ లేదని తేల్చేసింది యూనిట్. మూవీ లేకపోయినా బాహుబలి రూపంలో కొద్దిరోజుల్లోనే టీవీ సిరీస్ రాబోతోందని ఒకానొక సందర్భంలో చెప్పాడు రైటర్ విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బాహుబలి మేకర్స్తో ఓ మల్టీ నేషనల్ కంపెనీ చర్చలు జరుపుతోంది.
ఐతే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టకుండా, పర్యవేక్షణకే పరిమితంకానున్నాడు రాజమౌళి. కాకపోతే జక్కన్న పేరుని మాత్రం ఆ కంపెనీ వినియోగించుకోనుంది. సీజన్ వారీగా బాహుబలి సిరీస్ని తీసుకురావాలన్నది ఎంఎన్సీ థాట్. ఈ నేపథ్యంలో బాహుబలి పేరుని వినియోగించుకున్నందుకు రాయల్టీ రూపంలో మేకర్స్కి 25 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మిగతాచర్చలు ఓ కొలిక్కి వస్తే త్వరలో భారతీయ బుల్లితెర ప్రేక్షకులను బాహుబలి అలరించడం ఖాయం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







