సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి
- October 27, 2015
దక్షణ సౌదీ అరబియా ప్రాంతం, నజాన్ లోని షియా మసీదులో ఒక భక్తుని మృతికి, పలువురు గాయాల పాలవడానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాధ్యులుగా ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) ప్రకటించుకుంది. ఈ సంస్థ, సౌదీ అరబియా లో ఉండే మినారిటీ తెగ ఐన ఇస్మైలీ షియైతీ ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ గ్రూపు, అరబ్ ద్వీపకల్పంలోని పరిపాలకులపై తిరుగుబాటు లేవదీసి, సౌదీ లోని సున్నీ యువతను షియైతీ ల వంటి లక్ష్యాలపై దాడిచేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఒక తీవ్రవాది తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఈ దాడి చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిరూపణ అయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా అల్ మాష్హాడ్ మసీదులో సాయంకాల ప్రార్ధనలు ముగించుకొని ప్రజలు బయలుదేరుతుండగా దాడి జరిగిందని అక్కడి స్థానిక ప్రజలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ









