రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర

- August 31, 2017 , by Maagulf
రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర

తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. విమోచనంపై నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన నేటి సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com