జమ్మూ కశ్మీర్లోని కుల్గాం ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
- September 01, 2017
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం నుంచి భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. టాంట్రిపొరా ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. మృతిచెందిన ఉగ్రవాదిని మచివాకి చెందిన ఇస్ఫాక్ పద్దార్గా గుర్తించారు. కాగా శుక్రవారం పాకిస్తాన్ సైనిక మూకలు జమ్మూ కశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దీంతో నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్-ఉల్-అధాకి సరిగ్గా ఒక్కరోజు ముందు పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగబడడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







