తెలుగు దర్శకునికి కీలక పదవి
- September 04, 2017
ఆస్కార్ అవార్డుల 50 ఏళ్ల చరిత్రలో ఫారిన్ కేటగిరి విభాగంలో సినిమా ఎంపిక కోసం ఏర్పాటైన ఇండియా జ్యూరీ అధ్యక్షుడిగా తెలుగువారికి తొలిసారిగా స్థానం దక్కింది. సీనియర్ దర్శక నిర్మాత సీవీ రెడ్డి ఆ ఈ జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించిన ఆయన 2012లో ఇదే జ్యూరీలో సభ్యుడిగా పనిచేశారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల కమిటీల్లో పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయనకు ఈ పదవికి ఎంపిక కావడంపై తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీవీ రెడ్డి అధ్యక్షతన ఫారిన్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు కోసం సినిమాను ఎంపిక చేసేందుకు జ్యూరి సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈనెల 16 నుంచి హైదరాబాద్లో సినిమాల స్క్రీనింగ్ మొదలు కానుంది. భారతీయ భాషాల సినిమాల నుంచి వచ్చిన ఎంట్రీలో ఒక సినిమాను ఆస్కార్ కు పంపేందుకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







