హజ్ మెట్రో: అంతా ప్రశాంతం
- September 04, 2017
మినా: హజ్ మెట్రో ట్రైన్ సర్వీస్, హోలీ సైట్స్ మధ్యన ప్రశాతంంగా నిర్వహణ జరుగుతున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రెసిడెంట్ రుమైహ్ అల్ రుమైహ్ చెప్పారు. అల్ మషార్ అల్ మగద్దాస్సా మెట్రో, పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకులకు అద్భుతంగా సేవలందిస్తోందని అల్ రుమైహ్ వివరించారు. ట్రైన్ల మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిపుణులు పర్యవేక్షిస్తున్నాని ఆయన తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ విషయంలో అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. పిటిఎ అధికారి మొహమ్మద్ ఫహ్ద్ అల్ షబ్రామి మాట్లాడుతూ, హజ్ మెట్రో పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకుల రవాణాను స్మూత్గా చేస్తోందనీ, 20 కిలోమీటర్ల మేర 9 స్టేషన్లతో సేవలు అందిస్తోందనీ, ట్రైన్స్ పొడవు 300 మీటర్లుందని చెప్పారు. ఒక్కో రైల్ కార్, 3,000 మంది యాత్రీకులకు సేవలందిస్తోంది. గంటకు 72,000 మంది యాత్రీకుల్ని ఓ వైపు రవాణా చేస్తోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







