ఉత్తరకొరియా కు ఎదురు వెళ్లే శక్తి మాకు లేదు - పాకిస్తాన్
- September 05, 2017
ఉత్తరకొరియా దగ్గర ఉన్న అణు సాంకేతికత మాకంటే శక్తిమంతమైనదని పాకిస్థాన్ అణుశాస్త్రవేత్త డా.అబ్దుల్ ఖాదీర్ ఖాన్ తెలిపారు. ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షలో ప్యాంగ్యాంగ్కు పాక్ ఎటువంటి సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి పితామహుడిగా ఖాన్ను పిలుస్తారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఉ.కొరియా శాస్త్రవేత్తలు అత్యంత సామర్థ్యం కలిగిన వారు, వారిలో ఎక్కువ మంది రష్యాలో విద్యనభ్యసించారు. వారి దగ్గర మాకంటే మెరుగైన సాంకేతికత ఉంది. మా దగ్గర పాత, సంప్రదాయ టెక్నాలజీ ఉంది' అని ఆయన తెలిపారు. ఉత్తరకొరియా అణు ప్రయోగంలో పాకిస్థాన్ పాత్ర ఉందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
'హైడ్రోజన్ బాంబులు అణుబాంబుల కంటే మరింత శక్తిమంతమైనవి. ఉదాహరణకి..
అణుబాంబు రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న పరిసరాలను మాత్రమే నాశనం చేస్తుంది. కానీ హైడ్రోజన్ బాంబుకు నగరం మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఉంది' అని ఆయన పేర్కొన్నారు. ఉ.కొరియా ఆదివారం అణుపరీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్ హస్తం కూడా ఉందని ప్రపంచదేశాలు ఆరోపించాయి. ఉ.కొరియా చర్యలను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







