ఈద్ సందర్భంగా బహ్రెయిన్ హోటల్స్లో 90 శాతం ఆక్యుపెన్సీ రేట్
- September 05, 2017
మనామా: బహ్రెయిన్ హోటల్స్లో ఈద్ సందర్భంగా ఆక్యుపెన్సీ రేట్ 90 శాతానికి చేరుకుంది. హోటల్ రంగానికి సంబంధించి అధికారికంగా ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ఫోర్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్ రిప్రెజెంటేటివ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియా మరియు జిసిసి దేశాల నుంచి ఎక్కువగా అతిథులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఈద్ సందర్భంగా మొత్తం 16 రోజులపాటు హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్ చాలా బాగుందని హోటల్ రంగానికి చెందినవారు వివరించారు. అతిథుల్ని ఆకర్షించడంతోపాటుగా ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని సైతం ఈ గ్రోత్ ఆకర్షిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. జిసిసి టూరిస్టులకు పలు రకాలైన ఆఫర్లతో హోటళ్ళు ఆక్యుపెన్సీ రేట్ని పెంచుకున్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







