హరికేన్ హార్వీ కారణంగా టెక్సాస్కు పర్యావరణ ముప్పు
- September 05, 2017
హరికేన్ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది. హరికేన్ హార్వీ బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా అమెరికా అర్థిక వ్యవస్థకు హార్వీ కారణంగా సుమారు రూ.11.54 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా, హరికేన్ హార్వీ వల్ల సంభవించిన పర్యవరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బాటిల్ వాటర్నే తాగాలని, సర్జికల్ మాస్క్లు, కాలివేళ్లను మూసి ఉంచే షూస్, చేతి తొడుగులను వినియోగించాలని సూచించారు. కరీబియన్ దీవుల వైపుగా హరికేన్ ఇర్మా దూసుకువస్తోందని అమెరికా వాతావరణ విభా గం హెచ్చరించింది. కేటగిరి 4 తీవ్రత గల ఈ హరికేన్ ప్రభావం ప్యూర్టోరికో, ఫ్లోరిడా, కరీబియన్ దీవులపై ఎక్కువ ఉంటుందని, గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









