30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గింపు.!
- September 09, 2017
హెచ్ఐసీసీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు అక్టోబర్ 10వరకు గడువు పొడిగించారు. అందరూ ఒకేసారి ఫైల్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల నెట్వర్క్పై భారం పడుతోందని అరుణ్ జైట్లీ చెప్పారు. 30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గించినట్లు తెలిపారు. చింతపండు, ఇడ్లీ, దోశ బ్యాటన్లు, రెయిన్కోట్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామన్నారు. రబ్బర్ బ్యాండ్లపై జీఎస్టీ 18 నుంచి 12 శాతం తగ్గించామని, చిన్న కార్లపై అదనపు భారం లేకుండా చూడాలని చెప్పారు. చిన్న కార్లపై జీఎస్టీ 48 నుంచి 43 శాతానికి తగ్గించామన్నారు జైట్లీ.
పెద్ద కార్లపై సెస్ 5 శాతం పెంచినట్లు జైట్లీ చెప్పారు. స్పోర్ట్స్ కార్లపై 7 శాతం పెంచామన్నారు. నాలుగు రకాల వాహనాలపై యథా స్థితి కొనసాగింపు ఉంటుందన్నారు. కేసీఆర్ విజ్ఞప్తులపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. చేనేత రవాణా, విక్రయాలకు రూ.20 లక్షల వరకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. 1200 సీసీ పెట్రోల్, 1500 సీసీ డీజిల్ కార్లపై జీఎస్టీ యథాతథంగా ఉంటుందన్నారు. చేనేత రంగంలో రూ.20 లక్షల కంటే తక్కువ లావాదేవీల నిర్వహణకు కొంత మినహాయింపు ఉంటుందని జైట్లీ తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







