30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గింపు.!
- September 09, 2017
హెచ్ఐసీసీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు అక్టోబర్ 10వరకు గడువు పొడిగించారు. అందరూ ఒకేసారి ఫైల్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల నెట్వర్క్పై భారం పడుతోందని అరుణ్ జైట్లీ చెప్పారు. 30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గించినట్లు తెలిపారు. చింతపండు, ఇడ్లీ, దోశ బ్యాటన్లు, రెయిన్కోట్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామన్నారు. రబ్బర్ బ్యాండ్లపై జీఎస్టీ 18 నుంచి 12 శాతం తగ్గించామని, చిన్న కార్లపై అదనపు భారం లేకుండా చూడాలని చెప్పారు. చిన్న కార్లపై జీఎస్టీ 48 నుంచి 43 శాతానికి తగ్గించామన్నారు జైట్లీ.
పెద్ద కార్లపై సెస్ 5 శాతం పెంచినట్లు జైట్లీ చెప్పారు. స్పోర్ట్స్ కార్లపై 7 శాతం పెంచామన్నారు. నాలుగు రకాల వాహనాలపై యథా స్థితి కొనసాగింపు ఉంటుందన్నారు. కేసీఆర్ విజ్ఞప్తులపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. చేనేత రవాణా, విక్రయాలకు రూ.20 లక్షల వరకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. 1200 సీసీ పెట్రోల్, 1500 సీసీ డీజిల్ కార్లపై జీఎస్టీ యథాతథంగా ఉంటుందన్నారు. చేనేత రంగంలో రూ.20 లక్షల కంటే తక్కువ లావాదేవీల నిర్వహణకు కొంత మినహాయింపు ఉంటుందని జైట్లీ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









