విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాల పెంపొందించేందుకు వర్క్ షాప్
- September 09, 2017
మస్కట్: ఖిమ్జి శిక్షణ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ సోహార్, మస్కాట్ పాఠశాల క్యాబినెట్లో యువ నాయకులకు నాయకత్వ సామర్ధ్యాలను పెంపొందించుకోవటానికి మరియు మెరుగుపర్చడానికి ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ గా నదీమ్ అహ్మద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్సాహం కల్గించే ప్రదర్శనలు, సమూహ కార్యకలాపాలు, ప్రేరణ కల్గించే వీడియోలు మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమ ముగింపులో, వివిధ సమూహాలకు ప్రాతినిధ్యం వహించే విద్యార్ధీ తమ అనుభవాన్నిపంచుకోవడానికి ఆహ్వానించబడ్డారు .ఈ వర్క్ షాప్ లో నేర్చుకొన్న అభ్యాసాత్మక ఫలితాలపై యువ నాయకులు విస్తృతంగా ప్రకటించారు మరియు పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాంచిత వర్మ మాట్లాడుతూ, విశ్వాసం, ధైర్యం, దృష్టి మరియు భవిష్యత్తులో మంచి నేతలుగా విద్యార్థులను రూపొందడానికి ఇటువంటి వర్క్ షాప్ ల అవసరమైన ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖాధిపతి కమల్ గురుంగ్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









