'సావిత్రి' లో షాలిని

- September 09, 2017 , by Maagulf
'సావిత్రి' లో షాలిని

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో 'అర్జున్‌ రెడ్డి' చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు 'అర్జున్‌ రెడ్డి'లో షాలిని నటన నచ్చి 'సావిత్రి'లో అవకాశం ఇచ్చారట. ఇక జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో 'సావిత్రి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com