'సావిత్రి' లో షాలిని
- September 09, 2017
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో 'అర్జున్ రెడ్డి' చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
దర్శకుడు నాగ్ అశ్విన్కు 'అర్జున్ రెడ్డి'లో షాలిని నటన నచ్చి 'సావిత్రి'లో అవకాశం ఇచ్చారట. ఇక జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో 'సావిత్రి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







