మోడీ చిత్రం గీసి కాపురాన్ని కూల్చుకుంది

- September 09, 2017 , by Maagulf
మోడీ చిత్రం గీసి కాపురాన్ని కూల్చుకుంది

ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చిత్రాలు గీసిందని ఓ ముస్లిం మహిళను ఇంట్లో నుంచి గెంటేశారు అత్తింటివారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో చోటుచేసుకుంది.
బల్లియా ప్రాంతానికి చెందిన నగ్మా పర్వీన్‌కి పెయింటింగ్‌ అంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో సరదాగా మోదీ, యోగి పెయింటింగ్‌లు వేసింది. అది చూసిన అత్తింటివారు ఆమెను చావబాది ఇంట్లో నుంచి గెంటేశారు. విషయం తెలీడంతో నగ్మా తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
మతిస్థిమితం కోల్పోయి ఇలా పెయింటింగ్‌లు వేస్తోందని ఆరోపిస్తూ తన కుమార్తెను కొట్టి తరిమేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com