మహి.వి.రాఘవకు రూ. 7 కోట్ల లాస్
- September 12, 2017
టైటిల్ చూసి అదేంటి 'ఆనందో బ్రహ్మ' సినిమా హిట్ అయ్యింది కదా ఆ డైరెక్టర్ కు లాస్ రావడమేంటి అని అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీ మొత్తం చూడాల్సిందే..'ఆనందో బ్రహ్మ' ను డైరెక్టర్ చేసిన మహి.వి.రాఘవ ఎంబీఏ చేసి కొన్నేళ్లు ఉద్యోగం చేయడంతో పాటు బిజినెస్ కూడా చేసి బాగానే వెనకేసుకున్నాడు. ఐతే సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ముందు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడట. 'విలేజ్ లో వినాయకుడు'.. 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలను నిర్మించాడు. ఈ రెండూ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ రెండిటి వల్ల డబ్బులు పోయాయి.
ఆ తర్వాత మహి.. స్వీయ దర్శకత్వంలో 'పాఠశాల' అనే సినిమాను నిర్మించాడు. సినిమా బాగా తీసాడు , సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదట. దీంతో ఈ మూడింటి వల్ల దాదాపు రూ. 7 కోట్ల మేర డబ్బులు పోగొట్టుకున్నాడట. ఇక నిర్మాణ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యి 'ఆనందో బ్రహ్మ' ను కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కించి , దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చింది. శాటిలైట్ హక్కులు.. రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపితే.. ఈ సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్ల ఆదాయం ఆర్జించినట్లన్నమాట.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







