భారీగా అమ్ముడుపోయిన పవన్ త్రివిక్రంల మూవీ రైట్స్
- September 13, 2017
'కాటమరాయుడు' తర్వాత పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. సినిమా అమెరికా, నైజాం హక్కులు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపారు. అమెరికాలో రూ. 21 కోట్లకి, నైజాంలో రూ. 29 కోట్లకి అమ్ముడుపోయినట్లు ట్వీట్ చేశారు.
'బాహుబలి 2' కాకుండా థియేట్రికల్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రాబట్టిన తెలుగు చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
పవన్ 25వ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఖుష్బూ, మురళీశర్మ, రావురమేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







