ఇకపై జాతీయ పింఛను పధకంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం

- October 30, 2015 , by Maagulf
ఇకపై జాతీయ పింఛను పధకంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం

 

జాతీయ పింఛను పధకం (NPS) యొక్క విస్తృతిని పెంచేందుకు, ఇంకా ప్రవాస భారతీయులకు వృద్ధాప్యoలో 

సామాజిక, ఆర్ధిక భద్రతను పెంపొందించేందుకు రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవాస భారతీయులు కూడా ఈ 

పధకంలో చందాదారులయేందుకు అనుమతించారు. ఈ పధకం కింద సంవత్సర కనీస చందా 6,000 రూపాయలు. 

దీని చందా మొత్తాలను ప్రవాస భారతీయులు సాధారణ బాంకింగ్ పద్ధతుల ద్వారా లేదా NRE/ FCNR/NRO 

ఖాతాల ద్వారా నైనా చెల్లించవచ్చు అని వారు తెలియజేశారు.  ముఖ్యంగా గల్ఫ్ లోని ప్రవాస భారతీయులకు ఈ 

పధకం మేలు కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. యూ. ఏ. ఈ.  పెట్టుబడులలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అతి 

తక్కువైనందున  ప్రవాస భారతీయుల భాగం బహు స్వల్పమని, అందువల్ల వారికి ఈ పధకం మంచి అవకాశమని 

దుబాయిలో ఆర్ధిక మరియు సంపదల పోర్టల్ మానేజింగ్ డైరక్టర్ ప్రీతి భాంబ్రి  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com