దర్శకధీరుడు రాజమౌళి ఈ ఏడాది ANR అవార్డును అందుకున్నారు
- September 17, 2017
అక్కినేని నాగేశ్వరరావు పురస్కారోత్సవం కన్నుల పండువగా సాగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ఏడాది ANR అవార్డును అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ సహా.. బాహుబలి క్రియేటర్ను పొగడ్తల్లో ముంచెత్తారు. పాత పాటలను హమ్ చేసి ఆహూతులను ఆశ్చర్యపరిచారు సీఎం.
బాహుబలి సినిమాతో తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాల్లో రెపరెపలాడించిన దర్శకుడు రాజమౌళికి ANR పురస్కారం దక్కింది. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పురస్కారం దర్శకధీరుడిని వరించింది. సీఎం కేసీఆర్తో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ అవార్డును రాజమౌళికి ప్రదానం చేశారు.
రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తారు వెంకయ్యనాయుడు. బాహుబలి ఓ అద్భుతమని కొనియాడారు. ఈ అవార్డు ఆయనకు ఇవ్వడం సముచితమన్నారు. అలాగే, 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అదే సమయంలో తెలుగు వస్తేనే ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన కూడా తెస్తే బావుంటుందని ఆకాక్షించారు ఉప రాష్ట్రపతి.
ఇక సీఎం కేసీఆర్ కూడా రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. రాజమౌళి ట్రెండ్ సెట్టర్ అంటూ పొగడ్తలు గుప్పించారు. అక్కినేని జీవితం ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారని గుర్తుచేశారు. ఏఎన్ఆర్ ఎదుగుతూ చిత్రపరిశ్రమను అభివృద్ధి చేశారని, హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ తీసుకురావడంలో ఏఎన్ఆర్ కృషి ఎంతో ఉందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేసీఆర్ జనం కోసం ఆలోచించే వ్యక్తి అని.. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసన్నారు అక్కినేని నాగార్జున. హరితహారం, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, రణమాఫీలు ప్రజల కోసమే పెట్టారన్నారు. రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు నాగ్.
ఇక ANR లాంటి మహానుభావుడి పేరు మీదున్న అవార్డు అందుకోవడంతో తన మీద బాధ్యత మరింత పెరిగిందన్నారు రాజమౌళి. అక్కినేని అవార్డుకు మరింత గౌరవం తెచ్చేలా శాయశక్తులా కష్టపడతానని చెప్పారు.
వార్డుల ప్రదానోత్సవంలో కేసీఆర్ పాత పాటలను హమ్ చేయడంతో అక్కడున్న వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. అనే పాట, పడమట సంధ్యారాగం అనే ట్యూన్ను పాడిన కేసీఆర్.. ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం లేదన్నారు. కనీసం ఒక్కటైనా ఇలాంటి పాటలు పెట్టాలని సినీ పరిశ్రమను కోరారు కేసీఆర్.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







