విశాల్-లింగుస్వామిల రెండో 'పందెం కోడి' వస్తోంది!
- September 20, 2017
అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విశాల్. 'పందెంకోడి', 'భరణి', 'రాయుడు', 'ఇంద్రుడు', 'పూజ' తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నారు. ఇక విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం 'పందెంకోడి'. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. విశాల్-లింగుస్వామి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో విశాల్, లింగుస్వామి, రాజ్కరణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలి చిత్రంలో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా, సీక్వెల్లో కీర్తిసురేష్ ఆడిపాడనుంది. వరలక్ష్మి శరత్కుమార్ ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







