విశాల్-లింగుస్వామిల రెండో 'పందెం కోడి' వస్తోంది!
- September 20, 2017
అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విశాల్. 'పందెంకోడి', 'భరణి', 'రాయుడు', 'ఇంద్రుడు', 'పూజ' తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నారు. ఇక విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం 'పందెంకోడి'. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. విశాల్-లింగుస్వామి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో విశాల్, లింగుస్వామి, రాజ్కరణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలి చిత్రంలో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా, సీక్వెల్లో కీర్తిసురేష్ ఆడిపాడనుంది. వరలక్ష్మి శరత్కుమార్ ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









