'ఉరీ' ఉగ్ర దాడులు ఆధారంగా బాలీవుడ్ లో సినిమా

- September 20, 2017 , by Maagulf
'ఉరీ' ఉగ్ర దాడులు ఆధారంగా బాలీవుడ్ లో సినిమా

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏడాది క్రితం మన దేశ అధీన రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ దాడులు జరిపింది. ఇప్పుడు ఇదే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ 'ఉరి' ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత రొన్నే స్క్రేవాలా నిర్మించే ఈ సినిమాలో విక్కీ కుశాల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. లక్షిత దాడుల ద్వారా ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రొన్నే స్క్రేవాలా అన్నారు. ఈ సినిమాలో సైన్యానికి కమాండర్‌గా కనిపించనున్న విక్కీ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.  అంతేకాకుండా సైన్యం చేసిన ఈ దాడుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com