వి వి వినాయక్ సాయి ధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది

- September 22, 2017 , by Maagulf
వి వి  వినాయక్ సాయి ధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది

త్వరలో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం షూటింగ్‌ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ వెంటనే తన నెక్ట్స్ సినిమా కూడా మెగా హీరోతోనే చేస్తున్నారు. శుక్రవారం నుంచి సాయి ధరమ్-వినాయక్ కాంబినేషన్‌లో మూవీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వినాయక్‌తో సెట్‌లో తొలి రోజు.. తన కల నిజమైందంటూ సాయి ధరమ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమాకు ఆకుల శివ కథను అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com