మన్ కీ బాత్ కి మూడేళ్లు నిండాయి

- September 24, 2017 , by Maagulf
మన్ కీ బాత్ కి మూడేళ్లు నిండాయి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడేళ్లు నిండాయి. మోడీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆలిండియా రేడియోలో వచ్చే మన్ కీ బాత్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను పంచుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తను చేపట్ట బోయే పథకాల గురించి ప్రజలకు చెప్పి వారి సలహాలూ, సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 36వ సారి ప్రధాని తన మన్ కీ బాత్ చెప్పారు. ఈసారీ తన స్పీచ్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గురించి, బుల్లెట్ ట్రైన్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు. ఆర్మీలోకి వచ్చిన ఇద్దరు అమర జవాన్ల భార్యలను అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com