అక్టోబర్ 6న గల్ఫ్లో 'మార్చ్ 22' విడుదల
- September 25, 2017
దుబాయ్: కన్నడలో ఘనవిజయం సాధించిన 'మార్చ్ 22' సినిమా గల్ఫ్లో అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. దుబాయ్, అబుదాబీ, సార్జాలలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అనంత్ నాగ్, రాధికా చేతన్ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దుబాయ్లో, షార్జా, అబుదాబీల్లో సందడి చేయనున్నారు. సీనియర్ నటుడు అనంత్ నాగ్ 'మార్చ్ 22' సినిమాలో చూపిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన భార్య సీనియర్ నటి గాయత్రి అనంత్ నాగ్, రాధికా చేతన్, తదితరులు ఈ సినిమా తొలి ప్రదర్శనకు హాజరవుతారు. దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీష్ షెరిగార్, ఆయన సతీమణి షర్మిలా షెరిగార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకుడు కొడ్లు రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనికంఠ కద్రి - ఎన్జె రవిశంకర్ రాజంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







