కాబుల్ లో రాకెట్ దాడి, బాంబు పేలుళ్లు
- September 27, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాకెట్లతో విరుచుకుపడ్డ దుండగులు.. ఇప్పుడు బాంబు దాడులకు దిగారు. 25 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. నేటి ఉదయం ఎయిర్పోర్టు సమీపంలో రాకెట్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 20 నుంచి 30 రాకెట్లు పడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఆరు రాకెట్లు మాత్రమే పడినట్లు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్పోర్టును ఖాళీ చేయించారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటీస్ అఫ్గాన్కు చేరుకున్న కొద్ది గంటలకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. నాటో స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







