కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు
- November 01, 2015
కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు దేశంలో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలు చేయడం ద్వారా రానున్న కాలంలో రోడ్డు ప్రమాద సంఘటనలను క్రమేణా తగ్గించవచ్చని 'కతార్ చైన్ రియాక్షన్' వ్యవస్థాపక అధ్యక్షులు సభ్యులు - బెన్ కీన్ చెప్పారు. ఇటీవల ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటుచేసిన 'నేషనల్ వర్క్ షాప్ ఆన్ అఫె క్టివ్ అక్షన్స్ఆ ఆన్ ఆక్సిడెంట్ ప్రివెన్షన్ టు మైగ్రేట్ నంబర్ ఆఫ్ కతార్ రోడ్ ఆక్సిడెంట్స్' లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా బిన్ థాని వారి పోషకత్వంతో, నవంబర్ 16 నుండి 18 వరకు జరగనున్న24 వ ప్రపంచ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ కు కూడా కతార్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో స్వీడన్ నుండి పరిశోధకుల ప్రతినిధి బృందం, ప్రభుత్వ ప్రతినిధులు మరియు సంబంధిత రంగాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









