సంతోష్ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
- September 28, 2017
యేడాదికో సినిమా.. ఇప్పుడీ మాటకు స్పేస్ లేదు. కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు.. ఇంకా వీలైతే మూడో సినిమానూ అదే యేడాది కమిట్ అవుతున్నారు. ఈ యేడాది కాటమరాయుడుగా ఖలేజా చూపించాడు పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయకపోయినా కాటమరాయుడు డీసెంట్ విజయం సాధించింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ. ఓ సినిమా చేస్తూనే మరో సినిమా కమిట్ కావడమే కాదు.. షూటింగ్ లోనూ పార్టిసిపేట్ చేసి ప్రొడక్షన్ వర్క్ను రాపిడ్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లుతున్నాడు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగబోతున్నాడు. అందుకే వీలైనంత వేగంగా కొన్ని సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలో ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ మూవీని త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇది పవన్ కు 25వ సినిమా. భారీ తారాగణంతో మళ్లీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుందీ చిత్రం. కీర్తి సురేష్, అనూ ఇమ్మానయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తోంది. సో.. ఇప్పుడీ మూవీ సెట్స్ పై ఉండగానే.. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఓకే చేశాడు. అలాగే బాలీవుడ్ హిట్ మూవీ జాలీ ఎల్ఎల్ బీ -2కు రీమేక్ చేసేందుకూ ఓకే చెప్పాడు. ఆ మూవీకి మాటలు త్రివిక్రమ్ అందిస్తాడు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







