సంతోష్ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
- September 28, 2017
యేడాదికో సినిమా.. ఇప్పుడీ మాటకు స్పేస్ లేదు. కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు.. ఇంకా వీలైతే మూడో సినిమానూ అదే యేడాది కమిట్ అవుతున్నారు. ఈ యేడాది కాటమరాయుడుగా ఖలేజా చూపించాడు పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయకపోయినా కాటమరాయుడు డీసెంట్ విజయం సాధించింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ. ఓ సినిమా చేస్తూనే మరో సినిమా కమిట్ కావడమే కాదు.. షూటింగ్ లోనూ పార్టిసిపేట్ చేసి ప్రొడక్షన్ వర్క్ను రాపిడ్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లుతున్నాడు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగబోతున్నాడు. అందుకే వీలైనంత వేగంగా కొన్ని సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలో ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ మూవీని త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇది పవన్ కు 25వ సినిమా. భారీ తారాగణంతో మళ్లీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుందీ చిత్రం. కీర్తి సురేష్, అనూ ఇమ్మానయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తోంది. సో.. ఇప్పుడీ మూవీ సెట్స్ పై ఉండగానే.. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఓకే చేశాడు. అలాగే బాలీవుడ్ హిట్ మూవీ జాలీ ఎల్ఎల్ బీ -2కు రీమేక్ చేసేందుకూ ఓకే చెప్పాడు. ఆ మూవీకి మాటలు త్రివిక్రమ్ అందిస్తాడు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









