కోర్టు ప్రాంగణంలో మహిళ చెవి కొరికేసిన వ్యక్తి
- September 28, 2017
ఓ మహిళ దుబాయ్ కోర్టులో తన వద్ద పనిచేసే ఫిమేల్ స్టాఫ్కి సంబంధించిన లేబర్ కేసు కోసం రాగా, అక్కడే ఆ ప్రాంగణంలోనే ఓ వ్యక్తి ఆమె చెవిని కొరికేశాడు. ఈ ఘటనలో ఆమె చెవికి శాశ్వత డ్యామేజీ జరిగింది. అయితే నిందితుడు మాత్రం తాను ఆమెపై దాడి చేయాలనుకోలేదనీ, తనపై దాడి జరుగుతున్న క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించానని విచారణలో పోలీసులకు తెలిపాడు. అయితే బాధితురాలు మాత్రం తనపై నిందితుడు కావాలనే దాడి చేశాడననీ, ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నుంచీ అతడు తనను ఫాలో అవుతున్నాడనీ, సమయం చూసి తనపై దాడి చేశాడనీ, తన చెవి పూర్తిగా అతని నోటిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. నిందితుడు జరిపిన దాడిలోనే బాధితురాలు చెవిని కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. అక్టోబర్ 16వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా పడింది. మే 14న ఈ ఘటన జరిగింది. తన భార్యను ఆమె యజమాని అయిన మహిళ వేధిస్తుండడంతోనే ఆమెపై నిందితుడు దాడి చేసినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







