పోలీస్‌ శిక్షణలో ఆఫ్గాన్‌ పోలీసులకు భారత్‌ శిక్షణ

- September 28, 2017 , by Maagulf
పోలీస్‌ శిక్షణలో ఆఫ్గాన్‌ పోలీసులకు భారత్‌ శిక్షణ

పోలీస్‌ శిక్షణలో సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్‌, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య గురువారం అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆఫ్గాన్‌ ముఖ్య కార్యనిర్వాహకుడు (అధ్యక్షుడితో సమానమైన హోదా) అబ్దుల్లా అబ్దుల్లా ఈ మేరకు దిల్లీలో పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..ఆఫ్గానిస్థాన్‌ అభివృద్ధికి, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనటానికి, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవటానికి భారత్‌ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు. ఈ భేటీ సందర్భంగా ఆఫ్గానిస్థాన్‌ కళాకారులు ప్రత్యేకనైపుణ్యంతో తీర్చిదిద్దిన మొజాయిక్‌ చిత్రాన్ని ప్రధాని మోదీకి అబ్దుల్లా బహూకరించారు. భారత పర్యటనకు వచ్చిన అబ్దుల్లా గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com