బెంగళూరులోని పెట్రోల్ కొంటే.. బిర్యానీ ఉచితం
- September 29, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారికి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. రూ.250తో పెట్రోల్ కొంటే.. వారికి ఉచితంగా బిర్యానీ అందిస్తున్నారు. ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఈ ఆఫర్ను పెట్టింది. తమ వద్దకు వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఉచితంగా బిర్యానీ అందిస్తుంది.
ఈ ఆఫర్ అక్టోబర్ 6వరకు ఉంది. డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదండోయ్. పెట్రోల్ కొనుగోలు చేసిన ధరను బట్టి వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా, కుకీస్తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. ఓ వైపు పెట్రోల్.. మరో వైపు నోరూరించే బిర్యానీ ఆఫర్ భలే ఉంది కదూ..!
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









