సినిమాగా రాబోతున్న ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్
- September 29, 2017
సర్జికల్స్ స్ట్రయిక్స్కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.
గత ఏడాది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్పై ఢిల్లీలో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అంతేగాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయనే దృశ్యాలను కళ్లకు కట్టే విధంగా సినిమా కూడా రాబోతోంది.
సర్జికల్ స్ట్రయిక్స్పై ''ఉడీ'' పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్కి నాయకత్వం వహించిన కమాండర్గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









