దుబాయ్ లో అలరించిన కుమారి శ్రావణి నృత్యం
- November 01, 2015
కూచిపూడి నాట్యం లొ 10 సంవత్సరాలుగా సాధన చేస్తూ గల్ఫ్ లొ వున్న అన్ని తెలుగు సంస్థలలొను నాట్యం చేసి ఆహూతులను అలరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నది. 2015 మే లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి కుచిపూడి నాట్యం సర్టిఫికేట్ కోర్స్ లో ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణురాలయ్యింది.
2014 లో జరిగిన సిలికాన్ ఆంధ్ర మహాబృంద నాట్యం లో కూడా పాల్గొని గిన్నీసు బుక్ లో కూడ స్థానం సంపాదించినది. షార్జా లో జరిగిన ఆట-పాట రియాల్టి షొ లో ప్రధమ స్థానం సంపాదించినది. యు ఏ ఇ లో అన్ని ఎమిరేట్స్ ల లోను మలయళ, తమిళ్, తెలుగు మరియు ఇస్కాన్ లలో కుడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.2014 లో హైదరాబాద్ జతీస్ నట్యొత్సవం లో నాట్య వేద అవార్డ్ ను, విశాఖ భారత్ నాట్యొత్సవం లో యువ నాట్య సారధి అవార్డ్ ను పొందడం జరిగింది.
ఇటు నాట్యం లోను అటు కరాటే లోను సాధన సాగిస్తూ ప్రస్తుతం బ్లాక్ బెల్ట్ కు సాధన కొనసాగిస్తున్నది.ఒయాసిస్ కరాటే వారి సంవత్సర కార్యక్రమం లో కుడా వాళ్ళ అమ్మగారు లక్ష్మీ కామేశ్వరి గాత్రం తొ కూచిపుడి నాట్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా గల్ఫ్ లొ ఒకే వేదిక పై తల్లి పాడడం కూతురు నాట్యం చేయడం అందరిని అలరించినది.


తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









