యూఏఈ లో అంగారక గ్రహ అనుభూతి .... 13.6 కోట్ల డాలర్ల వ్యయంతో నూతన నగరం
- September 30, 2017
యూఏఈ : పెట్రో డబ్బులు ...పెట్రేగిపోయేలా చేస్తుందేమో ? భూమి మీద కాపురముంటూ... అంగారకుడిపై నివసిస్తే ఎలా ఉంటుందో అనే అనుభూతి కోసం అరబ్బు షేకులు ఓ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నారు. ‘మార్స్ సైంటిఫిక్ సిటీ’ పేరిట అద్భుతంగా కట్టబోతున్న ఈ ప్రాంతం అంగారకుడిని పోలిన వాతావరణంతో నిర్మాణమవుతోంది ఈ నగరం. మొత్తం విస్తీర్ణం 19 లక్షల చదరపు మీటర్లు. ఈ నగర నిర్మాణం కోసం అక్షరాలా 13.6 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఒక భారీ గోళాకారం వంటి నిర్మాణం లోపల ఉండే ఈ నగరంలో భవిష్యత్తులో అంగారకుడిపైకి చేరితే వ్యవసాయం ఎలా చేయాలి ? తాగు నీరు ..సాగు నీరు ఎలా సేకరించాలి అనే అంశాలన్నింటిపైనా క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతాయి. వాస్తవం ఏమిటంటే యూఏఈ ఇప్పటివరకూ ఓ సొంత ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించలేదు కానీ.. కానీ అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంకో మూడేళ్లలోపున అంగారకుడిపైకి ‘హోప్‘ పేరుతో ఓ అంతరిక్ష నౌకను పంపనుంది. యూఏఈ దేశం ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా.. అంటే 2021 నుంచి ఈ నౌక మార్స్ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఇంకో వందేళ్లకైనా సరే.. అంగారకుడిపై తామే సొంతంగా నగరాన్ని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ మార్స్ సైంటిఫిక్ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభించింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







