బహ్రెయిన్లో 'స్వచ్ఛతా హి సేవ' క్యాంపెయిన్
- October 01, 2017
మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ, 'స్వచ్ఛతా హి సేవా' క్యాంపెయిన్ని నిర్వహించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ మూడో వార్షికోత్సవం సందర్భంగా 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టేందుకు భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లోనూ ఇండియన్ ఎంబసీ ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతోంది. బహ్రెయిన్లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, ఈ సందర్భంగా స్వచ్ఛతపై అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరి అని చెప్పారు. ప్రముఖ బాలీవుడవ్ నటుడు సునీల్ శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛ భారత్ దివస్గా పరిగణిస్తోన్న సంగతి తెలిసినదే. అరేబియన్ క్రికెట్ ఫెస్టివల్లో పాల్గొననుండడం, అలాగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం, స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా ఆనందంగా ఉందని సునీల్ శెట్టి చెప్పారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







