మోడీ కి కోవెల నిర్మాణం
- October 03, 2017
మీరట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం ఆలయం నిర్మించాలని ఓ మాజీ ఇంజినీర్ నిర్ణయించుకున్నారు. అందులో 100 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఈ ఆలయంలో మోదీ విగ్రహానికి పూజలు చేయడానికి మాత్రం వీల్లేదు. త్వరలోనే మీరట్లో దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్కు చెందిన జేపీ సింగ్ రిటైర్డ్ ఇంజినీర్. 'మోదీ మందిర్' పేరుతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆలయం మోదీ గౌరవార్థం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సింగ్ వెల్లడించారు. 'ప్రజల కోసం మోదీ ఎంతో చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆయనలా చేయలేదు. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ మందిర్ను నిర్మిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంటుంది. ఆలయ గర్భగుడిలో విష్ణు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటాయి.' అని ఆయన వెల్లడించారు.
రూ.10కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మరో రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









