సరికొత్త వ్యవసాయం
- October 03, 2017
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు డ్రోన్లతోనే పంట పండించారు. రోబోలతోనే ప్రయోగాత్మక రీతిలో వ్యవసాయం చేశారు. రోబో వ్యవసాయ క్షేత్రం ద్వారా సుమారు అయిదు టన్నుల బార్లేను పండించారు. డ్రోన్ల సహాయంతో పంట పండించటం ఇదే మొదటిసారి. భూమిని చదును చేయడం, విత్తనాలు నాటడం, ఎరువులు చల్లడం, పంటను కోయడం.. అంతా రోబోల సహాయంతోనే జరిగింది. రకరకాల వాహనాలతో వ్యవసాయం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. బ్రిటన్కు చెందిన హార్పర్ ఆడమ్స్ యూనివర్సిటీ పరిశోధకలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు అని నిరూపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ జనాభాకు తగ్గట్టుగా ఆహార కొరతను రోబో ఫార్మిగ్ ద్వారా తీర్చుకోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు. హ్యాండ్స్ ఫ్రీ హెక్టార్ అన్న రీతిలో వ్యవసాయం చేపట్టారు. మెషీన్లు, సాఫ్ట్వేర్తోనే పంట పండించారు. డ్రోన్లను కూడా వాడారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







