సరికొత్త వ్యవసాయం

- October 03, 2017 , by Maagulf
సరికొత్త వ్యవసాయం

లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు డ్రోన్లతోనే పంట పండించారు. రోబోలతోనే ప్రయోగాత్మక రీతిలో వ్యవసాయం చేశారు. రోబో వ్యవసాయ క్షేత్రం ద్వారా సుమారు అయిదు టన్నుల బార్లేను పండించారు. డ్రోన్ల సహాయంతో పంట పండించటం ఇదే మొదటిసారి. భూమిని చదును చేయడం, విత్తనాలు నాటడం, ఎరువులు చల్లడం, పంటను కోయడం.. అంతా రోబోల సహాయంతోనే జరిగింది. రకరకాల వాహనాలతో వ్యవసాయం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన హార్పర్ ఆడమ్స్ యూనివర్సిటీ పరిశోధకలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు అని నిరూపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ జనాభాకు తగ్గట్టుగా ఆహార కొరతను రోబో ఫార్మిగ్ ద్వారా తీర్చుకోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు. హ్యాండ్స్ ఫ్రీ హెక్టార్ అన్న రీతిలో వ్యవసాయం చేపట్టారు. మెషీన్లు, సాఫ్ట్‌వేర్‌తోనే పంట పండించారు. డ్రోన్లను కూడా వాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com