మోడీ కి కోవెల నిర్మాణం

- October 03, 2017 , by Maagulf
మోడీ కి కోవెల నిర్మాణం

మీరట్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం ఆలయం నిర్మించాలని ఓ మాజీ ఇంజినీర్‌ నిర్ణయించుకున్నారు. అందులో 100 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఈ ఆలయంలో మోదీ విగ్రహానికి పూజలు చేయడానికి మాత్రం వీల్లేదు. త్వరలోనే మీరట్‌లో దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన జేపీ సింగ్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌. 'మోదీ మందిర్‌' పేరుతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆలయం మోదీ గౌరవార్థం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 23న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సింగ్‌ వెల్లడించారు. 'ప్రజల కోసం మోదీ ఎంతో చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆయనలా చేయలేదు. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ మందిర్‌ను నిర్మిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంటుంది. ఆలయ గర్భగుడిలో విష్ణు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటాయి.' అని ఆయన వెల్లడించారు.

రూ.10కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మరో రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com