మోడీ కి కోవెల నిర్మాణం
- October 03, 2017
మీరట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం ఆలయం నిర్మించాలని ఓ మాజీ ఇంజినీర్ నిర్ణయించుకున్నారు. అందులో 100 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఈ ఆలయంలో మోదీ విగ్రహానికి పూజలు చేయడానికి మాత్రం వీల్లేదు. త్వరలోనే మీరట్లో దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్కు చెందిన జేపీ సింగ్ రిటైర్డ్ ఇంజినీర్. 'మోదీ మందిర్' పేరుతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆలయం మోదీ గౌరవార్థం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సింగ్ వెల్లడించారు. 'ప్రజల కోసం మోదీ ఎంతో చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆయనలా చేయలేదు. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ మందిర్ను నిర్మిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంటుంది. ఆలయ గర్భగుడిలో విష్ణు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటాయి.' అని ఆయన వెల్లడించారు.
రూ.10కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మరో రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









