మోడీ కి కోవెల నిర్మాణం
- October 03, 2017
మీరట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం ఆలయం నిర్మించాలని ఓ మాజీ ఇంజినీర్ నిర్ణయించుకున్నారు. అందులో 100 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఈ ఆలయంలో మోదీ విగ్రహానికి పూజలు చేయడానికి మాత్రం వీల్లేదు. త్వరలోనే మీరట్లో దీని నిర్మాణం ప్రారంభం కానుంది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్కు చెందిన జేపీ సింగ్ రిటైర్డ్ ఇంజినీర్. 'మోదీ మందిర్' పేరుతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆలయం మోదీ గౌరవార్థం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సింగ్ వెల్లడించారు. 'ప్రజల కోసం మోదీ ఎంతో చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆయనలా చేయలేదు. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ మందిర్ను నిర్మిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంటుంది. ఆలయ గర్భగుడిలో విష్ణు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటాయి.' అని ఆయన వెల్లడించారు.
రూ.10కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. మరో రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







