అషూరా ప్రొసెషన్‌ సందర్భంగా ఐదుగురు పోలీసులకు గాయాలు

- October 03, 2017 , by Maagulf
అషూరా ప్రొసెషన్‌ సందర్భంగా ఐదుగురు పోలీసులకు గాయాలు

మనామా: అషురా ప్రొపెషన్‌ సందర్భంగా జరిగిన తీవ్రవాద దాడిలో ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ వివరాల్ని వెల్లడించింది. దైయాహ్‌లో బుడైయా అవెన్యూ వైపుగా అషురా ప్రొసెషన్‌ కోసం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్యాపిటల్‌ గవర్నర్‌ షేక్‌ హిషామ్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ ఖలీఫా ఈ దాడిని ఖండించారు. అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నామనీ, దోషుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. అసాంఘీక శక్తుల ఆటలు సాగనివ్వబోమని, పౌరుల భద్రత కోసం రౌండ్‌ ద క్లాక్‌ భద్రత కొనసాగుతుందని వివరించారు షేక్‌ హిషామ్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com