శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

- October 04, 2017 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని అత్యవసరంగా దింపారు. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  అయితే.. ఎయిర్‌పోర్ట్‌లోని అపోలో ఆస్పత్రిలో ప్రయాణికుడిని తరలించగా.. అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్‌ నుంచి సౌదీకి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న మహ్మద్ అల్ఫాసారి అనే 74 ఏళ్ల వృద్ధుడిగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌ శంషాబాద్‌ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com