'శివ' మేజిక్ మరోసారి రిపీట్ అవ్వనుంది
- October 04, 2017
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా అనగానే గుర్తొచ్చేది 'శివ'. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ సినిమాతో నాగార్జున క్రేజ్ కూడా రెట్టింపు అయింది. ఆ తరువాత వర్మ డైరెక్షన్ లో 'గోవింద గోవింద' అనే సినిమాలో నటించాడు నాగార్జున. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. నాగార్జునతో ఓ రియలిస్టిక్ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వర్మ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 'దాదాపు 28 ఏళ్ల తరువాత నాగార్జునతో కలిసి పని చేయబోతున్నాను. ఇప్పుడు చేసే సినిమా కూడా 'శివ' చిత్రంలా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం లేదు. ఇప్పటివరకు నేను, నాగార్జున కలిసి ఇలాంటి సినిమా చేయలేదు. శివ చిత్రంతో నాకు బ్రేక్ ఇచ్చిన నాగార్జునతో ఓ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించి ఆయనకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని వెల్లడించాడు.
నాగార్జున కూడా ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వర్మ చెప్పిన కథ బాగా ఎగ్జైట్ చేసిందనీ, కథలో కొన్ని మార్పులు చెప్పానని త్వరలోనే పూర్తి కథతో నా దగ్గరకి రాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం నాగార్జున నటించిన 'రాజు గారి గది2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







