13న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్
- October 07, 2017
ఢిల్లీ: ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. పెట్రో డీలర్లు 13న దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 54 వేల బంక్ లు మూతపడనున్నట్లు సమాచారం. ఈ బంద్ కు నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించినట్లు పెట్రో డీలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోక పోవటాన్ని వీరు తప్పుబట్టారు. రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను సైతం రూపొందించ లేదని ఆరోపించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే.. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







