13న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్
- October 07, 2017ఢిల్లీ: ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. పెట్రో డీలర్లు 13న దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 54 వేల బంక్ లు మూతపడనున్నట్లు సమాచారం. ఈ బంద్ కు నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించినట్లు పెట్రో డీలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోక పోవటాన్ని వీరు తప్పుబట్టారు. రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను సైతం రూపొందించ లేదని ఆరోపించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే.. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!