చైనా-భారత్ సరిహద్దుల్లో పర్యటించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్

- October 08, 2017 , by Maagulf
చైనా-భారత్ సరిహద్దుల్లో పర్యటించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్

అసలే.. చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సరిహద్దుల్లో పర్యటించారు దేశ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా ఇలాంటి పర్యటనలపై భగ్గుమంటుంది చైనా ప్రభుత్వం. కానీ.. సీతారామన్ మాత్రం.. సరిహద్దుల్లో టెన్షన్‌ను తగ్గించడం కోసం.. ఈ టూర్‌లో తనదైన మార్క్‌ను చూపించారు.
రెండు దేశాలకు కీలకమైన నాథు లా పాస్‌ దగ్గర సైనికాధికారులతో సమావేశమై.. సరిహద్దుల్లో మోహరింపుపై ఆరా తీశారు. ఇదే సమయంలో.. చైనా భూభాగం నుంచి ఆ దేశ సైనికులు సీతారామన్‌ను ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ఆమె... చేయి ఊపుతూ.. వారిని పలకరించారు. 
ఆ తర్వాత.. భారత సైనికాధికారులతో కలిసి.. చైనా సైనికాధికారులను కలుసుకున్నారు రక్షణమంత్రి. వారికి నమస్తే చెప్పారు.. నమస్తే అంటే అర్థం చెప్పి.. అక్కడున్న ప్రతీ ఒక్కరితో నమస్తే పెట్టించారు. ఇలా గతంలో ఏ రక్షణ మంత్రి నేరుగా సరిహద్దుల్లో చైనా సైనికులతో చర్చించిన సందర్భాలు లేవు. నిర్మలా యాక్షన్‌కు కూల్ అయిపోయారు చైనా భద్రతా సిబ్బంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ.. సీతారామన్‌ ఆ దేశ సైనికులతో సరదాగా ముచ్చటించడం వల్ల.. ఉద్రిక్తతలు తగ్గుతాయన్న వాదన వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com