ఎయిర్ బెలూన్ల ద్వారా ప్రాజెక్ట్ లూన్
- November 03, 2015
సాఫ్ట్వేర్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్తో మరోసారి తన శక్తిసామర్థ్యాలను చాటనుంది. గాలిలో ఎగిరే ఎయిర్ బెలూన్ల ద్వారా భారత్లోని వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లూన్' పేరిట గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకురానున్న ఈ సేవలను బీఎస్ఎన్ఎల్తో కలిపి అందించనుంది. న్యూజిలాండ్, యూఎస్ఏ కాలిఫోర్నియా, బ్రెజిల్ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించగా మన దగ్గర అతి త్వరలోనే ఇవి ప్రారంభం కానున్నాయి. భూమి ఉపరితలానికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఆయా డివైస్లకు ఈ బెలూన్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. 4జీ టెక్నాలజీకి సరిసమానంగా ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. తన చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4జీ డివైస్లకు బెలూన్లు కమ్యూనికేట్ అవుతాయి. సౌరశక్తిని ఉపయోగించుకుంటూ ఈ బెలూన్లు సొంతంగా విద్యుత్ను తయారు చేసుకుని అదే శక్తిని తన పనుల కోసం వినియోగించుకుంటాయి. వీటి ద్వారా ఏ ప్రదేశంలోనైనా అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలను వినియోగదారులు పొందేందుకు వీలుంది. బీఎస్ఎన్ఎల్తో కలిసి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. 'ప్రాజెక్ట్ లూన్' సేవలను మరింత విస్తృతం చేయడానికి ఇతర టెలిఫోన్ ఆపరేటర్లతో కూడా గూగుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









