ఎయిర్ బెలూన్ల ద్వారా ప్రాజెక్ట్ లూన్
- November 03, 2015
సాఫ్ట్వేర్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్తో మరోసారి తన శక్తిసామర్థ్యాలను చాటనుంది. గాలిలో ఎగిరే ఎయిర్ బెలూన్ల ద్వారా భారత్లోని వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లూన్' పేరిట గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకురానున్న ఈ సేవలను బీఎస్ఎన్ఎల్తో కలిపి అందించనుంది. న్యూజిలాండ్, యూఎస్ఏ కాలిఫోర్నియా, బ్రెజిల్ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించగా మన దగ్గర అతి త్వరలోనే ఇవి ప్రారంభం కానున్నాయి. భూమి ఉపరితలానికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఆయా డివైస్లకు ఈ బెలూన్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. 4జీ టెక్నాలజీకి సరిసమానంగా ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. తన చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4జీ డివైస్లకు బెలూన్లు కమ్యూనికేట్ అవుతాయి. సౌరశక్తిని ఉపయోగించుకుంటూ ఈ బెలూన్లు సొంతంగా విద్యుత్ను తయారు చేసుకుని అదే శక్తిని తన పనుల కోసం వినియోగించుకుంటాయి. వీటి ద్వారా ఏ ప్రదేశంలోనైనా అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలను వినియోగదారులు పొందేందుకు వీలుంది. బీఎస్ఎన్ఎల్తో కలిసి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. 'ప్రాజెక్ట్ లూన్' సేవలను మరింత విస్తృతం చేయడానికి ఇతర టెలిఫోన్ ఆపరేటర్లతో కూడా గూగుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







